యాడికి మండలం రాయలచెరువులో మంగళవారం లారీ ఢీకొనడంతో గందోడి నారాయణ అనే వృద్ధుడు తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై గందోడి నారాయణ మనవడు జగదీష్ బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సీఐ శ్రీనివాసులు విచారణ చేసి ప్రమాదానికి కారణమైన బళ్లారికి చెందిన లారీ డ్రైవర్ షేక్షావలి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.