అనంతపురం జిల్లా పర్వత దేవరపల్లి వద్ద ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
Anantapur Urban, Anantapur | Nov 9, 2025
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం లోని రాప్తాడు మండలం పర్వతా దేవరపల్లి వద్ద ముందు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని మరో ద్విచక్ర వాహనం వేగంగా ఢీకొన్న ఘటనలో ప్రమీల అనే మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన ఆమెను 1033 నేషనల్ హైవే అథారిటీ వారి అంబులెన్స్ ద్వారా అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.