కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గం పరిధిలోని యర్రగుంట్ల మండలం యర్రగుంట్ల పట్టణం లో ఎర్ర చందనం దుంగలను తరలించిన కేసులో నలుగురు వ్యక్తులకు ఆరు నెలల జైలు శిక్ష,ఒక్కొక్కరికి రెండు వేల రూపాయలు జరిమానా విధించినట్లు కోర్టు తీర్పు ఇచ్చినట్లు మంగళవారం పోలీసులు తెలిపారు.యర్రగుంట్ల పట్టణంలోని వ్యవసాయ చెక్ పోస్ట్ వద్ద, ప్రొద్దుటూరు రోడ్ సైడ్ వద్ద 2014 సెప్టెంబర్ 21వ తేదిన నలుగురు ముద్దాయిలు 40 కేజీల బరువు గల 6 ఎర్రచంద్రనం దుంగలను దొంగతనంగా తరలిస్తున్నారని, పోలీసులు కేసు రిజిస్టర్ చేసి, కమలాపురం కోర్ట్లో విచారణ జరపగాJFCM కోర్ట్ కమలాపురం వారు ఆరు నెలలు జైలు శిక్ష,2వేలు జరిమానా విధించారు.