మా పార్టీ కౌన్సిలర్లకు ఎమ్మెల్యే సురేంద్రబాబు ప్రలోభాలకు గురిచేసి మున్సిపల్ చైర్మన్ పదవి దక్కించుకున్నారని మాజీ ఎంపీ తలారి రంగయ్య ఆరోపించారు. గురువారం జరిగిన మున్సిపల్ చైర్మన్ ఎన్నికల్లో ఇద్దరు వైసీపీ కౌన్సిలర్లను ప్రలోభాలకు గురిచేసి ఓటింగ్కు రాకుండా చేశారన్నారు. అయినప్పటికీ 11 మంది కౌన్సిలర్లు ప్రలోభాలకు గురికాకుండా గట్టిగా నిలబడి తమ నిజాయితీని నిరూపించుకున్నారని ప్రశంసించారు. ప్రలోభాలతో చైర్మన్ పదవి కైవసం చేసుకుని సంబరాలు చేసుకోవడం సిగ్గుచేటన్నారు. అంతకుముందు వైఎస్సార్సీపీకి ఓటు వేసిన 11 మంది కౌన్సిలర్లను ఊరేగించారు. శాలువాలు, పూలమాలలతో సత్కరించారు.