ప్రకాశం జిల్లా గిద్దలూరు మున్సిపాలిటీ పరిధిలో ఆదివారం వీధి కుక్కలు బెంబేలెత్తించాయి. ఏకంగా 6 మంది చిన్నారులపై దాడి చేసి గాయపరిచాయి. శ్రీరామ్నగర్, బ్రిటన్ రోడ్డు, గణేష్ నగర్, పాతాళ నాగేశ్వర స్వామి టెంపుల్ ఏరియాలో కుక్కలు చిన్నారులపై దాడి చేశాయి. కుక్కల దాడిలో గాయపడ్డ చిన్నారులను గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. వీధి కుక్కలతో ఆందోళనగా ఉందని అధికారులు స్పందించి వెంటనే వీధి కుక్కలను నిర్మూలించాలని కోరుతున్నారు.