యువత చెడు వ్యసనాలకు బానిస కావద్దని, తమ ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కెరమెరి ఎస్సె మధుకర్ పిలుపునిచ్చారు. కెరమెరి ఖైరీ గ్రామంలో గురువారం రాత్రి పోలీస్ కళాజాత నిర్వహించారు. ఎస్సై మాట్లాడుతూ..గంజాయి, డ్రగ్స్,తదితర మత్తు పదార్థాల వల్ల యువత తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని వివరించారు. ఎవరైనా గంజాయి సేవించిన,అమ్మిన పోలీసులకు సమాచారం అందించాలన్నారు.