రేణిగుంట: 'అమరరాజా' క్వార్టర్స్లో దొంగతనం రేణిగుంట (M) తారకరామా నగర్లోని అమరరాజా ఫ్యాక్టరీ క్వార్టర్స్ లోని ఓ ఇంట్లో జరిగిన దొంగతనం కలకలం రేపింది. గుర్తు తెలియని దొంగలు తాళాలు పగలగొట్టి 450 గ్రా. బంగారం, 3 కిలోల వెండిని అపహరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఘటనా స్థలాన్ని పరిశీలించి ఆధారాలను సేకరించారు. దర్యాప్తు కొనసాగుతోంది.