యాడికి మండల కేంద్రంలో సోమవారం రాత్రి శ్రీ అయ్యప్ప స్వామి గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప ఆలయ కమిటీ సభ్యులు, అయ్యప్ప మాలదారులు, భక్తుల ఆధ్వర్యంలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. అయ్యప్ప స్వామి దేవాలయం వద్ద నుంచి గ్రామంలోని పురవీధుల గుండా ఊరేగింపు నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తులు పెద్దపెటున నినాదాలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు వినియోగం చేశారు.