పంటలకు కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర ప్రకటించిందని రాష్ట్ర ప్రభుత్వం కూడా బోనస్ మద్దతు ధర ప్రకటించి కొనుగోలు చేయాలని సీపీఐ యాడికి మండల కార్యదర్శి మహమ్మద్ రఫీ డిమాండ్ చేశారు.యాడికి రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం సీపీఐ, రైతు సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.కౌలు రైతులకు కూడా అన్నదాత సుఖీభవ పథకాన్ని వర్తింపజేయాలన్నారు.తహశీల్దార్ వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా నాయకులు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.