యర్రగొండపాలెం: ఉమ్మడి ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల గోడపత్రిక ఆవిష్కరించిన టిడిపి ఇన్చార్జి ఎరిక్షన్ బాబు
ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండల కేంద్రంలో వెలిసిన త్రిపురాంతకేశ్వర స్వామి బాలత్రిపుర సుందరి దేవి అమ్మవారి ఆలయాలలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో శరన్నవరాత్రి ఉత్సవాల సంబంధించిన గోడపత్రికను ఎర్రగొండపాలెం టిడిపి కార్యాలయంలో ఆలయ కమిటీ సభ్యులతో కలిసి టిడిపి ఇన్చార్జి గూడూరి ఎరీక్షణ బాబు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించాలని కమిటీ సభ్యులకు తెలియజేసినట్లు ఎరిక్షన్ బాబు తెలిపారు.