దీపావళి పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణంలో ఆదివారం సందడి నెలకొంది. పాత బస్టాండ్, కొత్త బస్టాండ్, పోతిరెడ్డిపల్లి చౌరస్తా, సాయిబాబా దేవాలయం వద్ద ప్రత్యేకంగా బొమ్మల దుకాణాలు ఏర్పాటు చేశారు. ప్రజలు బొమ్మలను కొనుగోలు చేశారు. అయితే, గత ఏడాది కంటే ఈసారి ధరలు రెట్టింపు అయ్యాయని కొనుగోలుదారులు ఆవేదన వ్యక్తం చేశారు.