బాపట్ల జిల్లా బట్టిప్రోలు మండలం పల్లెకోన గ్రామంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకొని గురువారం కోడి పందాలు విచ్చలవిడిగా జరిగాయి. వేల రూపాయలు కోడిపందాల ద్వారా చేతులు మారినట్లుగా తెలుస్తుంది. రాజకీయ నాయకుల వత్తిళ్లు వల్లే పోలీసులు చూసి చూడనట్లు వ్యవహరించినట్లుగా తెలుస్తుంది. అంతేకాకుండా సాంప్రదాయ బద్ధంగా కోడి పందాలు సంక్రాంతికి నిర్వహిస్తున్న నేపథ్యంలో రాజకీయ నాయకులు కూడా అందుకు మద్దతు తెలిపినట్లు స్థానికులు చెబుతున్నారు.