గృహప్రవేశం చేసుకుంటున్న యజమానిపై హిజ్రాలు కర్రలతో దాడికి పాల్పడిన ఘటన చీర్యాలలోని బాలాజీ ఎంక్లేవ్ చోటుచేసుకుంది. మంగళవారం సాధానందం నూతన ఇంటి వద్దకు వచ్చిన హిజ్రాలు మొదట లక్ష డిమాండ్ చేశారు. యాజమాన్య నిరాకరించడంతో మరో 15 మందిని వెంటబెట్టుకొచ్చి కుటుంబ సభ్యులపై విచక్షణారహితంగా కొట్టారు. ఈ దాడిలో సదానందం తలకు గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.