అప్పుల బాధ తాళలేక సూపర్ వాస్మోల్ తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Oct 20, 2025
అనంతపురం నగరంలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అత్యవసర వైద్య విభాగంలో చికిత్స పొందుతూ అనంతపురం నగరానికి చెందిన డేరంగుల బాబు అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. సోమవారం తెల్లవారుజామున సూపర్ బాస్మల్ తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడిన అతనిని గమనించిన కుటుంబ సభ్యులు అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్న క్రమంలో మృతి చెందాడు. ఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు.