ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలంలోని వెలుగు వారి పాలెం ప్రభుత్వ పాఠశాలలో ఎంఈఓ సుబ్బయ్య గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థుల సామర్థ్యాలను పరీక్షించేందుకు వివిధ గ్రేడ్ల వారిగా పలు ప్రశ్నలు అడిగి వారి విద్యా ప్రమాణాలను అందిన వేశారన్నారు. అనంతరం పాఠశాల రికార్డులను పరిశీలించి నాణ్యమైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు పలు సూచనలు చేసినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో హెచ్ఎం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు.