RGUKT Rk valley లో నేడు NSS యూనిట్ 11,13,14 &15 ఆధ్వర్యంలో మూడవరోజు ప్రత్యేక శిబిరాలను కొండ్లవాండ్లపల్లి, తాళ్లపల్లి, కుమ్మరంపల్లి,కుమార్ కాలువలో ఏర్పాటు చేశారు. ఈరోజు ప్రభుత్వ కార్యాలయాలలో పిచ్చి మొక్కలు తీయడం. డ్రగ్స్, మత్తు పదార్థాల వినియోగం పై కలిగే అనర్థాలను డిజిటల్ లిటరసీ వంటి అంశాలపై ఆయా గ్రామాలలో అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో NSS కోఆర్డినేటర్ మరియు ప్రోగ్రాం ఆఫీసర్లు దీప్తి, గోవర్ధన్, తిరుపతిరెడ్డి, సుబ్బరాయుడు మరియు 200 మంది విద్యార్థులు వాలంటీర్లు పాల్గొన్నారు.