మానవ తప్పిదాల వల్ల రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ప్రకాశం జిల్లా మార్కాపురం డి.ఎస్.పి నాగరాజు అన్నారు. బేస్తవారిపేట పోలీస్ స్టేషన్ ఆవరణలో లారీ డ్రైవర్లకు గురువారం అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. మితిమీరిన వేగంతో పాటు మానవ తప్పిదంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు డ్రైవర్ కు సూచించారు. నిబంధనలు అతిక్రమించి వాహనాలు నడిపితే చట్టపరమైన కఠిన చర్యలు తప్పవని డిఎస్పి డ్రైవర్లను హెచ్చరించారు. ఇటీవల జరుగుతున్న వరుస ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు ఈ అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు.