ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సదరన్ రీజనల్ సెంటర్ సహకారంతో, ఉస్మానియా విశ్వవిద్యాలయం భూగోళ శాస్త్ర విభాగమా ఆధ్వర్యంలో ఎమర్జింగ్ స్కాలర్షిప్ కోసం పరిశోధనా పద్ధతుల శిక్షణా అనే పేరుతో 10 రోజుల ఇంటెన్సివ్ కోర్సును విజయవంతంగా ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో కర్ణాటక, పాండిచ్చేరి, తమిళనాడు వంటి వివిధ రాష్ట్రాల నుండి వచ్చిన 30 మంది పరిశోధక విద్యార్థులకు ఆధ్యాధునిక పరిశోధనా పద్ధతులపై శిక్షణ ఇవ్వబడుతుంది. ఈ శిక్షణ ప్రాంతీయ పట్టణ పర్యావరణ అధ్యయన కేంద్రంలో జరుగుతోందని అధికారులు వెల్లడించారు.