జగిత్యాల: గ్రీవెన్స్ డే బాధితుల సమస్యల పరిష్కారానికి చర్యలు బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలి-జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,
ప్రతి సోమవారం ఉదయం 10-30 నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా ఈరోజు జిల్లా పోలీసు జగిత్యాల కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 12 మంది అర్జీదారులతో ఎస్పీ గారు స్వయంగా కలసి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి, ఫిర్యాదుల పూర్తి వివరాలు సమర్పించాలని అధికారులను ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో వచ్చే ఫిర్యాదులను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడంతో పాటు పెండింగులో లేకుండా ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. బాధితుల యొక్క ప్రతి ఫిర్యాదును ఆన్ లైన్ లో పొందుపరుస్తూ నిత్యం పర్యవేక్షణ చ