పొదలకూరు మండలం డేగపూడి రాజుపాళెం వద్ద కల్వర్టు కూలిపోయింది, విషయం తెలుసుకున్న సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వెంటనే స్పందించి ఆర్ అండ్ బీ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లారు. అధికారులకు సహకరించాలని పొదలకూరు మండల టీడీపీ నేతలకు ఎమ్మెల్యే ఆదేశాలు ఇచ్చారు. ఎమ్మెల్యే సోమిరెడ్డి సూచనలతో యుద్ధప్రాతిపదికన తాత్కాలిక మరమ్మతులు రాత్రి 11 గంటల దాకా జరుగుతూనే ఉన్నాయి.