ఏపీ మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పులివెందుల రైతులపై కపట ప్రేమతో డ్రామాలు చేస్తున్నారని పులివెందుల నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ బీటెక్ రవి విమర్శించారు. అరటి పంట సమస్యలు అమెరికా షరతుల వల్ల ఎగుమతులు తగ్గడంతో వచ్చాయని తెలిపారు. రైతులపై చిత్తశుద్ధి తమకు ఉంది కాబట్టి ఎర్రబెల్లి చెరువుకు నీటిని విడుదల చేశామని చెప్పారు ప్రస్తుతం అరటిపంట ధరలు నిలకడగా ఉన్నాయన్నారు.