ప్రకాశం జిల్లా కొండపి సెంటర్లో సీఐ సోమశేఖర్ వాహనదారులకు బుధవారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఎక్కువ శాతం రోడ్డు ప్రమాదాల్లో తలకు దెబ్బ తగలడంతోనే చనిపోతున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలు పాటించాలని కోరారు. హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎస్ఐ ప్రేమ్ కుమార్ పాల్గొన్నారు.