నంద్యాల జిల్లా సిరివెళ్లలో విషాద ఘటన చోటు చేసుకుంది గ్రామ సమీపంలోని ఆనకట్ట వద్ద ఎద్దులు కడిగేందుకు తీసుకుని వెళ్ళగా ఎద్దులు మృతి చెందాయి, అవి చేపల వలలో చిక్కుకొని మృతి చెంది ఉంటాయని అనుకున్నారు, మృతిచెందిన ఎద్దులు స్థానిక పాడి రైతు పూల ఇస్మాయిల్ కు చెందినవిగా గుర్తించారు, రైతుకు చేదోడుగా ఉన్న ఎద్దులు మరణించడంతో ఆ రైతు కుటుంబం కన్నీరు అవుతుంది, శుక్రవారం రైతు ఎద్దులు ఆనకట్టలో మృతి చెందిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు, హెడ్ కానిస్టేబుల్ నరసింహుడు స్వయంగా ఘటనా స్థలానికి చేరుకొని ఆనకట్టలో దిగి పరిశీలించారు, పరిశీలన అనంతరం వలల కారణంగా ఎద్దులు మృతి చెందలేదని స్పష్టం చేశారు,