కంబదూరు మండలం చెన్నంపల్లి శివారులోని పెన్నా నది నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను పోలీసులు బుధవారం రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ట్రాక్టర్లను సీజ్ చేశారు. ముగ్గురు ట్రాక్టర్ డ్రైవర్ల పై కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా ఎస్సై లోకేష్ మాట్లాడారు. ఇసుకను అక్రమంగా తరలిస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎక్కడైనా ఇసుక అక్రమంగా రవాణా జరుగుతున్నట్లయితే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. సమాచార ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.