జిల్లాలో పర్యావరణ పరిరక్షణ భూమి ఆరోగ్య సంరక్షణ ప్రకృతి వనరుల సుస్థిర వినియోగాన్ని అభివృద్ధి చేయడం లక్ష్యంగా ధర్తీ మాత బచావ్ అభియాన్ కార్యక్రమం ద్వారా రైతుల్లో విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి వ్యవసాయ అధికారులు ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్లోదర్తీ మాత బచావ్ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు ,యాగంటిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ధనలక్ష్మి ,వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులు, ఏడీఏలు ,మండల వ్యవసాయ అధికారులు పాల్గొన్నారు