గత మూడు రోజులుగా నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు ముత్తుకూరు మండలం జంగాల కండ్రిగ లోని గిరిజన కాలనీలో నీరు చేరిపోయింది. కాలవ గట్టు అంచున నివాసం ఉంటున్న గిరిజనుల ఇళ్లలోకి నీరు చేరిపోవడంతో.. వారి పరిస్థితిని సర్వేపల్లి నియోజకవర్గ ఇన్చార్జి సురేష్ నాయుడు గమనించారు. వారికి అవసరమైన భోజనం వసతి కల్పించారు. రాత్రి సమయంలో కరెంటు సౌకర్యం కల్పిస్తామని.. ఇబ్బందులు ఉంటే తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిష్కరిస్తామని ఆదివారం ఆయన తెలిపారు