మార్కాపురం జిల్లా కేంద్రంలోని టిడిపి కార్యాలయం నందు సీఎం సహాయనిధి చెక్కులను బాధితులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి సతీమణి వసంతలక్ష్మి అందజేశారు. నియోజకవర్గంలో వివిధ సమస్యలతో అనారోగ్యానికి గురై ఇబ్బందులు పడుతున్న బాధితులకు సీఎం సహాయ నిధి కింద ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో అందజేసినట్లు ఆమె తెలిపారు. కూటమి ప్రభుత్వం బాదితలకు అండగా ఉంటుందన్నారు.