రేణిగుంట కుక్కల దొడ్డి వద్ద రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రేణిగుంట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి రేణిగుంట (M) కుక్కల దొడ్డి వద్ద మంగళవారం తెల్లవారుజామున ఘోర ప్రమాదం జరిగింది. కర్నూల్ నుంచి రేణిగుంట వైపు వస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న తల్లి, కుమారుడు అక్కడికక్కడే మృతి చెందారు. కోడలు సాఫ్ట్వేర్ ఉద్యోగి కావడంతో చెన్నైలో వదిలేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కోడలు, చిన్నారి గాయాలతో బయటపడ్డారు. లారీ డ్రైవర్ నిద్రలో ఉండటమే కారణమని తెలుస్తోంది.