ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో గాయపడిన వృద్ధుడు చికిత్స పొందుతూ మృతి
Anantapur Urban, Anantapur | Nov 13, 2025
అనంతపురం నగర శివారులోని ఆర్డిటి ప్రధాన కార్యాలయం వద్ద ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో తీవ్రంగా గాయపడిన అనంతపురం జిల్లా సింగనమల నియోజకవర్గం లోని సింగనమల మండలం చిన్న మట్ల గొంది గ్రామానికి చెందిన వెంకట రాముడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని మార్చురీకి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి ఇటుకలపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.