ప్రకాశం జిల్లా టంగుటూరులో నిద్రిస్తున్న సెక్యూరిటీ గార్డుపై కత్తితో దాడి చేసి గుర్తుతెలియని వ్యక్తులు హత మార్చారు. మర్రిపూడి మండలం కూచిపూడి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య హెచ్డిఎఫ్సి బ్యాంకులో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తున్నారు. గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేయడంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ హజరతయ్యా తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.