మార్కాపురం జిల్లా పెద్దారవీడు మండల కేంద్రంలో సిపిఎం జిల్లా నాయకులు దగ్గుపాటి సోమయ్య ఆధ్వర్యంలో ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేయకుండా యధావిధిగా అమలు చేయాలని నిరసన తెలిపారు. అనంతరం కరపత్రాలను పంపిణీ చేశారు. పేదల పొట్ట కొట్టి కార్పొరేట్ సంస్థలకు వేలకోట్లు కట్ట పెడుతున్నారని మండిపడ్డారు. కొత్త నిబంధనల పేరుతో చట్టాన్ని నీరుగార్చడం తగదని కూలీల హక్కులను కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు.