వనపర్తి: ప్రజావాణి దరఖాస్తులను వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన వనపర్తి కలెక్టర్ ఆదర్శ్
సోమవారం వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐడివైసి కార్యాలయంలో ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లాలోని అన్ని శాఖల అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి జిల్లా వ్యాప్తంగా వచ్చిన ప్రజావాణి దరఖాస్తులను నేరుగా స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత శాఖ అధికారులతో మాట్లాడుతూ ప్రజావాణి దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి వేగవంతంగా పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని ఆదేశాలు ఇచ్చారు ఈ కార్యక్రమంలో సంబంధిత జిల్లా అధికారులు తదితరులు ఉన్నారు