ఉదయగిరి: పొలంగారిపల్లి వద్ద హైవేపై గేదెలను ఢీకొన్న గ్యాస్ సిలిండర్లల లారీ
సీతారాంపురం మండలం,పోలంగారి పల్లి హైవే వద్ద ఓ గ్యాస్ సిలిండర్ లారీ గేదెలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ఒక గేదె, రెండు కోడె దూడలు అక్కడికక్కడే మృతి చెందాయి. సీతారాంపురం గ్యాస్ సిలిండర్ పాయింట్ వద్ద సిలిండర్లు అన్లోడ్ చేసి తిరిగి ఉదయగిరి వైపు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. వర్షం కురుస్తున్న సమయంలో ఒక్కసారిగా గేదెలు రోడ్డు దాటుతుండగా డ్రైవర్ వాటిని ఢీ కొట్టినట్లు చెప్పారు.