ఇస్నాపూర్ మున్సిపాలిటీ చిట్కుల్ వడ్డెర కాలనీలో విషాదం నెలకొంది. లోన్ ఏజెంట్ వేధింపులు తట్టుకోలేక సాయి కృష్ణ ఉరేసుకున్నాడు. సాయి కృష్ణ కటింగ్ షాప్ నడుపుతూ కాకతీయ ఆసుపత్రిలో అంబులెన్స్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఓ బ్యాంకు నుంచి తీసుకున్న 15 లక్షల లోన్ చెల్లింపులు ఆలస్యం అవ్వడంతో ఏజెంట్లు తరచూ ఫోన్ చేశారని, వేధింపులు తలలేక సూసైడ్ చేసుకున్నట్లు కుటుంబీకులు తెలిపారు.