ప్రకాశం జిల్లా ఒంగోలు నగరంలోని కేశవస్వామిపేటలో గల శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థానంలో ఉపాలయంగా విరాజుల్లుతున్న శ్రీ వెంకటేశ్వర వారి దేవస్థానంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా రాత్రి వేళల్లో శ్రీనివాసునికి నిర్వహించిన గరుడ ఉత్సవం నయన మనోహరంగా సాగింది. పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకొని గరుడ వాహనం పై దేదీప్యమానంగా భక్తులను కటాక్షిస్తున్న శ్రీనివాసుని దివ్య మంగళ స్వరూపాన్ని కనులారా తిలకించి ప్రత్యేక అర్చనలను జరిపించుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు దేవాలయ కమిటీ హాజరయ్యారు