రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 19వ తేదీన కడప జిల్లా కమలాపురం నియోజకవర్గం పరిధిలోని పెండ్లిమర్రి మండలం దాసరిపల్లి, వెల్లటూరు గ్రామాల పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బందోబస్తు విధులలో పాల్గొనబోయే పోలీసు అధికారులతో మంగళవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో బ్రీఫింగ్ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా బందోబస్తు విధులపై పోలీసు అధికారులకు దిశానిర్దేశం చేశారు. కార్యక్రమం ప్రారంభం నుండి ముగిసే వరకు ప్రతి అధికారి అప్రమత్తంగా వ్యవహరించి తమ విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించాలంటూ ఎస్పీ సూచించారు.