కలికిరి పట్టణంలోని ఏయన్ ఆర్ కాలనీలో ఇరిగేషన్ కాలువ పూడి వర్షపు నీరు పోక ఇళ్ళలోకి నీరు చేరడంతో టీడీపీ యువ నాయకులు కలికిరి అభివృద్ధి కమిటీ చైర్మన్ రెడ్డి వారి యోగేష్ స్పందించి వెంటనే పరిష్కరించారు. కలికిరి మండలం కలికిరి పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పడమర వైపున నుంచి వస్తున్న కాలువలో చెట్లు,పిచ్చి మొక్కలతో నిండి, ప్రస్తుతం కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువన కుంటలు నిండి ఇరిగేషన్ కాలువ ద్వారా నీరు భారీగా కాలువలోకి ప్రవహించింది. దీంతో కాలువ నిండి పక్కనే ఉన్న ఇళ్ళలోకి కొంత మేర చేరుకున్నాయి. రెండు జేసీబిలను ఏర్పాటు చేసి కాలువలు పూడిక తీసి సమస్య పరిష్కరించారు.