రాయదుర్గం: మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీఓ ఉపసంహరించుకోవాలి : ఏపిఐఐసి మాజీ చైర్మన్ మెట్టుగోవిందరెడ్డి
మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ధారాదత్తం చేసే జీఓ ను తక్షణమే ఉపసంహరించుకోవాలని ఏపిఐఐసి మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ మెట్టుగోవిందరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం సాయంత్రం రాయదుర్గంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో ఈనెల 12 న తలపెట్టిన ప్రజాఉద్యమ భారీ ర్యాలీ కి సంబంధించిన పోస్టర్లను పార్టీ నాయకుతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోటి సంతకాల సేకరణకు రాయదుర్గం నియోజకవర్గంలో అనూహ్య స్పందన లభిస్తోందని తెలిపారు. ప్రభుత్వం మెడలు వంచి మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు తెచ్చిన జీఓ ఉపసంహరించుకునేలా చేస్తామని స్పష్టం చేశారు.