ప్రకాశం జిల్లా పామూరు పట్టణంలోని మదన వేణుగోపాలస్వామి ఆలయానికి మంగళవారం ముక్కోటి ఏకాదశి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఉత్త ద్వారం ద్వారా స్వామి వారు భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో భక్తులు పాల్గొని అర్చకులు అందించిన తీర్థప్రసాదాలు స్వీకరించారు. కనిగిరి డిఎస్పి సాయి ఈశ్వర్ యశ్వంత్ ఎటువంటి అవాచీనమైన సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు.