కొత్తగూడెం: కొత్తగూడ మండలం గాంధీనగర్ లో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం అని తెలిపిన విద్యుత్ అధికారులు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గాంధీనగర్ గ్రామంలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగని ఉందని విద్యుత్ శాఖ అధికారులు శనివారం సాయంత్రం ఏడు గంటలకు ఒక ప్రకటనలో తెలిపారు. కావున రేపు ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని విద్యుత్ శాఖ ఏఈ తెలిపారు.. గాంధీనగర్ సంబంధించిన కొత్త ట్రాన్స్ఫారం మరమ్మత్తులు చేస్తున్నామని అందుకు విద్యుత్కు అంతరాయం కలుగుతుందని అన్నారు.. మండలంలోని ప్రజలందరూ సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు తెలిపారు