ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన సఖీ సురక్ష కార్యక్రమాన్ని MLA కాలవ శ్రీనివాసులు ప్రారంభించారు. శుక్రవారం ప్రభుత్వ జూనియర్ కళాశాల వేదికగా పట్టణ మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. కౌన్సిలర్లు పాల్గొన్నారు. మహిళల ఆరోగ్యం మెరుగుపరచడమే లక్ష్యమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. క్షేత్రస్థాయి నుంచి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు. మున్సిపల్ కమిషనర్ దివాకర్ రెడ్డి పాల్గొన్నారు.