ప్రకాశం జిల్లాకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు చేరుకున్నాయి. అక్టోబర్ 27,28,29, తేదీలలో జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా కలెక్టర్ రాజాబాబు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే అధికారాలను అప్రమత్తం చేస్తూ పాఠశాలలకు సెలవులు ప్రకటించారు. అంతేకాకుండా ఎటువంటి తుఫాను పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అందులో భాగంగా ఎన్డీఆర్ఎఫ్ బృందాలను రంగంలోకి దించామని కలెక్టర్ రాజాబాబు ప్రకటించారు.