ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వైసీపీ కార్యాలయం నందు ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని కోటి 42 లక్షల మంది ప్రజలకు సంజీవినైన ఆరోగ్య శ్రీ పథకం చీకటి అధ్యయనానికి ముఖ్యమంత్రి తెరతీసారని విమర్శించారు. 3000 కోట్లకు పైగా బకాయిలు పెట్టిన రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయని పట్టించుకోవడం లేదన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు.