జీడి నెల్లూరులో భారీగా పొట్టేళ్లు మాయం గంగాధర నెల్లూరు మండలంలో పొట్టేళ్లు మాయమవుతున్నాయని బాధితులు మంగళవారం తెలిపారు. నెల్లేపల్లి పరిసర ప్రాంతాల్లో గొర్రెల పెంపకం ఎక్కువగా ఉంది. ఇటీవల పొట్టేళ్ల దొంగతనాలు పెరగడంతో, నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడి కానున్నాయి.