యాడికి మండల కేంద్రంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆదివారం అయ్యప్ప స్వామి 36వ గ్రామోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. అయ్యప్ప మాలదారులు, భక్తులు గ్రామోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో రుద్రాభిషేకం, పంచామృతాభిషేకం, మహాభిషేకంతోపాటు గణపతి హోమాన్ని నిర్వహించారు. భక్తులు ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు తీర్థప్రసాదాలు వినియోగం చేశారు.