పలమనేరు: మండలం అర్బన్ పోలీస్ స్టేషన్ వర్గాలు సోమవారం మీడియాకు తెలిపిన సమాచారం మేరకు. పలమనేరు మండలం అర్బన్ సిఐ గా మోహన్ రెడ్డి పదవీ బాధ్యతలు చేపట్టారని తెలిపారు. కాగా గత నెలలో సీఐ మురళీమోహన్ చిత్తూరుకు బదిలీ కాగా ఆయన స్థానంలో నేడు మోహన్ రెడ్డి సిఐగా పదవీ బాధ్యతలు చేపట్టారు. పలమనేరు మండల పరిధిలో రోడ్ సేఫ్టీ, లా అండ్ ఆర్డర్ పరిరక్షణ ధ్యేయంగా పనిచేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.