బందరు కలెక్టరేట్ మీకోసం కార్యక్రమంలో 166 అర్జీలు స్వీకరించామని తెలిపిన జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖరరావు
Machilipatnam South, Krishna | Sep 15, 2025
ప్రజల నుండి అందుతున్న మీకోసం అర్జీలను ఎప్పటికప్పుడు సకాలంలో పరిష్కరించేందుకు కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి కే చంద్రశేఖర రావు అధికారులకు సూచించారు. సోమవారం ఉదయం 11 గంటల సమయం నుండి మద్యాహ్నం రెండు గంటల సమయం వరకు స్తానిక మచిలీపట్నంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో డిఆర్ఓ, కె ఆర్ ఆర్ సి ఎస్ డి సి శ్రీదేవి, సర్వ శిక్ష ప్రాజెక్ట్ అధికారి కుమిదిని సింగ్ లతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక---మీకోసం కార్యక్రమం నిర్వహించి వివిధ ప్రాంతాల ప్రజలను నుండి అర్జీలను స్వీకరించారు.