తెలుగు గంగా కాలువలో యువకుడు,మరో బాలుడు గల్లంతు ఉబ్బలమడుగు సమీపంలో ఘటన వరదయ్యపాలెం మండలం ఉబ్బలమడుగు సమీపంలో గల తెలుగు గంగ కాలవలో షరీఫ్ అనే యువకుడు ..మరో ఆరేళ్ల బాలుడు మహిత్ గల్లంతయ్యారు. ఆదివారం సాయంత్రం కారు కడిగేందుకు కాలువ సమీపంలో గల ర్యాంపు వద్దకు వెళ్లి లోనికి దిగి కాలుజారి వారిద్దరు కాలువలోకి కొట్టుకు పోవడంతో వారి ఆచూకీ లభించలేదు. అటు వరదయ్యపాలెం, పోలీసు లు బీ ఎన్ కండ్రిగ మండలం పోలీసులు గాలింపుచర్యలు చేపడుతున్నారు.