అనంతపురం: అనంతపురం జిల్లా దయ్యాలకుంటపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడి యువకుడికి గాయాలు
అనంతపురం జిల్లాలోని బుక్కరాయసముద్రం మండలం దయ్యాలకుంటపల్లి వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడిన సంఘటనలో శశి అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన అతనిని 108 సహాయంతో అనంతపురం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనకు సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.