మేడ్చల్ నియోజకవర్గంలోని మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని ఉద్దేమర్రి గ్రామంలో నిర్మితమైన ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ పూజా కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు,నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జీ తోటకూర వజ్రేష్ యాదవ్ పాల్గొని, ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ఈ ఇళ్లను అందించిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల ద్వారా లక్షలాది మంది పేద కుటుంబాలకు లబ్ధి చేకూరిందని అన్నారు.